లాసన్స్బే కాలనీ రవీంద్ర భారతి పాఠశాలలో ఏడో తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపు తీసుకొని అనధికారికంగా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్నారని విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
ముందుగా డిప్యూటీ డీఈవో ప్రేమ్కుమార్ పాఠశాలలోని రికార్డులు పరిశీలించారు. ఉన్నత తరగతులకు సంబంధించి గుర్తింపు లేకపోవడంతో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గొండు సీతారామ్, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో పాఠశాలను సీజ్ చేశారు.
యాజమాన్యం మాత్రం మంగళవారం నాటికి ధ్రువపత్రాలు సమర్పిస్తామని పేర్కొంది. కొంతసేపు పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు కూడా హాజరయ్యారు.
కొనసాగుతున్న దాడులు
విశాలాక్షినగర్: సోమవారం ధారపాలేనికి చెందిన వివేకానంద పాఠశాల, తవ్వవానిపాలెం మినర్వ పాఠశాల, ఎంవీపీకాలనీ రవీంద్రభారతి స్కూల్, మధురవాడ భాష్యం పాఠశాలలను మూసేశామని అధికారులు తెలిపారు.
Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399