భారత్లో కరోనా: 873 కేసులు, 19 మరణాలు
భారత్లో కరోనా: 873 కేసులు, 19 మరణాలు

దిల్లీ: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం ఉదయానికి దేశవ్యాప్తంగా 873 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. కొవిడ్-19 కారణంగా దేశంలో ఇప్పటివరకు మొత్తం 19మంది మృతి చెందినట్లు ప్రకటించింది. వైరస్ సోకిన మొత్తం బాధితుల్లో 79 మంది కోలుకోగా ప్రస్తుతం 775 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి దాదాపు అన్ని రాష్ట్రాలకు విస్తరించింది.
తెలంగాణలోనే ఇప్పటివరకు 59కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ కరోనా కారణంగా నలుగురు మరణిచంగా గుజరాత్లో ముగ్గురు మరణించారు. కర్ణాటకలో ఇద్దరు మరణించగా కేరళలో దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏపీలో 13 మందికి కరోనా పాజిటివ్ గా గుర్తించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.