Posted on December 19, 2016 by vijay kumar in Realestate News
స్వర్ణాంధ్ర నిర్మాణానికి సైకాలజిస్టులూ సారథులే జాతీయ అధ్యక్షుడు డాక్టర్ హిప్నో కమలాకర్
విజయనగరం రింగురోడ్డు, న్యూస్టుడే:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలలుగంటున్న స్వర్ణాంధ్ర నిర్మాణం సాకారం కావాలంటే దానికి ప్రజలను సన్నద్ధం చేయడంలో సైకాలజిస్టుల సేవలను వినియోగించుకోవాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్టుల అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ హిప్నో కమలాకర్ అన్నారు. ఆదివారం సాయంత్రం ప్రెస్క్లబ్లో నిర్వహించిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సదస్సులో ఆయన మాట్లాడారు. కౌన్సెలింగ్ వృత్తి సామాజిక బాధ్యతతో కూడుకున్నదని, మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్లే కౌన్సెలింగ్లో సైకాలజిస్టులుగా రాణిస్తారన్న విషయాన్ని సైకాలజిస్టులు గమనించాలని సూచించారు. సైకాలజిస్టుల వృత్తిని కొందరు గ్లామర్ పాత్రగా మలుచుకున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో వారికంటే గొప్ప సైకాలజిస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారని, వారికి సరైన వేదికనిస్తే సమాజానికి మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రతి మండలానికి ఒక సైకాలజిస్టు అవసరం ఉంటుందని, వారి సేవలను వినియోగించుకోవాలని కోరుతూ త్వరలో కలెక్టర్, ఎస్పీలకు వారందరి జాబితాను అందజేయడం జరుగుతుందన్నారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం వల్ల సైకాలజిస్టులు పెద్ద పాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్వీ రమణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాంబాబు, పవన్ ఆశిష్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు టి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399