Posted on October 20, 2016 by vijay kumar in Realestate News
సింహగిరిపై ప్రకృతి వైద్యశాల జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభం రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్
సింహాచలం, న్యూస్టుడే: దివ్యక్షేత్రం అభివృద్ధి పనుల్లో భాగంగా సింహగిరిపై జనవరిలో ప్రకృతి వైద్యశాల నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ చెప్పారు. బుధవారం ఆయన శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆలయ ఉద్యోగుల వయో పరిమితి 60 సంవత్సరాలకు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. 6ఏ కేటగిరి దేవాలయాల్లో ఐఏఎస్ అధికారులను నియమించే ఆలోచన లేదన్నారు. దేవాలయంలో పదోన్నతులు అందరికీ ఒకే విధంగా జరిగేటట్టు చూడాలన్న కొందరు అర్చకుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. అనంతరం నూతన వంటశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. సింహగిరి మార్కెట్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. సింహాచలం క్షేత్ర పాలకుడు శ్రీత్రిపురాంతక స్వామి ఆలయంలో కొన్నిమార్పులు చేయాలని సూచించారు. ప్రధాన దేవాలయం ప్రహరీ నిర్మాణం, కాలువలను రాతితోనే నిర్మించాలన్నారు. పవిత్రమైన సహజ సిద్ధమైన అనంతామృత ధారకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా పనులు చేయాలన్నారు.
ప్రపంచ వైద్యశాస్త్ర నిపుణుల సూచనల ప్రకారం భక్తుల ఆరోగ్యరీత్యా లడ్డు ప్రసాదాన్ని తగ్గించి వాటి స్థానంలో ఎండుఫలాలు ఎక్కువగా విక్రయించాలని కార్యదర్శి ఆలయ అధికారులకు సూచించారు. తొలుత ఆయన అప్పన్నస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో కె రామచంద్రమోహన్ స్వామి ప్రసాదం అందజేశారు. కాకినాడ ఆర్జేసీ ఆజాద్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399