విశాఖ జోన్ ఉత్తరాంధ్ర ప్రజల కోరిక
మంత్రి గంటా శ్రీనివాసరావు

కాపుల సంక్షేమానికి చర్యలు
కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రాత్రి గవర్నర్ బంగ్లాలో అఖిల భారత కాపు సమాఖ్య ప్రచురించిన జర్నల్ను మంత్రి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కాపుల సంక్షేమానికి బడ్జెట్లో రూ. వెయ్యికోట్లు కేటాయించిందన్నారు. ప్రభుత్వం అందించే చేయూతతో ఆర్థికంగా ఎదగాలన్నారు. విశాఖలో కాపు భవనం నిర్మాణానికి స్థలం కేటాయించామన్నారు. సమావేశంలో గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, కాపు సంఘం నాయకులు అర్జునరావు, పొట్టిమూర్తి తదితరులు పాల్గొన్నారు.