రూ. 4 కోట్లతో అనకాపల్లిలో అభివృద్ధి పనులు రైల్వే సీనియర్ డీసీఎం సత్యనారాయణ
అనకాపల్లి గ్రామీణం, న్యూస్టుడే: అనకాపల్లి రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు అదనపు సౌకర్యాల కల్పనకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని విజయవాడ డివిజన్ కమర్షియల్ విభాగానికి చెందిన సీనియర్ డీసీఎం ఎన్.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన ఆదివారం అనకాపల్లి రైల్వేస్టేషన్ను సందర్శించారు. మొత్తం రూ. 4 కోట్లతో పనులు చేపడుతున్నామన్నారు. వర్షాలు ప్రారంభం కాకముందే పనులు త్వరితగతిన పూర్తయ్యే చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గూడ్స్షెడ్డు నుంచి రెండు, మూడు ప్లాట్ఫాంల మీదకు వెళ్లడానికి వీలుగా రూ. 1.50 లక్షలతో కాలిబాట వంతెన నిర్మిస్తామన్నారు. అనకాపల్లి స్టేషన్కు ప్రయాణికుల ద్వారా రోజూ రూ. 4 లక్షల ఆదాయం వస్తోందన్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో 2014-15 సంవత్సరానికి రూ. 7.65 కోట్లు, 2015-16 సంవత్సరానికి రూ. 8.33 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అనకాపల్లి రైల్వేస్టేషన్లో ఎంపీ నిధులు రూ. 13 లక్షలతో ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా 25 కుర్చీలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని బుకింగ్ కౌంటర్, మూడు ప్లాట్ఫాంలపై ఏర్పాటు చేశామన్నారు. ఎలమంచిలి స్టేషన్కి 10 కుర్చీలు పంపించామన్నారు. త్వరలో జరగబోయే విజయవాడ పుష్కరాలకు అనకాపల్లి, విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతామన్నారు. త్వరలో చోడవరం, నర్సీపట్నం రైల్వేస్టేషన్ల్లో రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్లు నిర్మించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు. స్టేషన్ సూపరింటెండెంట్ పార్థసారథి, రైల్వే రక్షక దళం ఎస్సై శ్రీనివాసరావు, కమర్షియల్, ట్రాక్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399