నగర ఐ.టి.కి మరో మణిహారం
సిద్ధమవుతున్న మిలీనియం టవర్
మరో టవర్ నిర్మాణానికి ఆదేశాలు

మూడున్నర లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి….: మిలీనియం టవర్ ద్వారా 3.50 లక్షల చదరపు అడుగుల ప్రాంగణం అందుబాటులోకొస్తోంది. నాలుగెకరాల్లో రూ. 145 కోట్ల వ్యయంతో నిర్మిస్తుండగా.. ఇప్పటిదాకా రూ. 80 కోట్ల వరకు ఖర్చయ్యాయి. ఫ్లోరింగ్, ఇతర పనులను చేయాల్సి ఉంది. ఎనిమిది అంతస్తుల్లో (జి+7) మొత్తం రెండు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని విధి నిర్వహణకు అనుకూలంగా తీర్చిదిద్దుతారు. వాహనాల పార్కింగ్ కోసం 1.50 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. ఇందుకోసం రెండు బేస్మెంట్లు నిర్మించారు. మొత్తం పది ఫ్లోర్లు ఉంటాయి. ఎ.పి.ఐ.ఐ.సి. అధికారుల ఆధ్వర్యంలో నిర్మాణం సాగింది. లిఫ్టులు, ఏసీలు, అగ్నిమాపక పరికరాలు, జనరేటర్లు తదితరాలన్నీ ప్రభుత్వం సమకూరుస్తుంది. అంతస్తుల లోపలి భాగాలను కాండ్యుయంట్ సంస్థ తన అవసరాలకు వీలుగా అభివృద్ధి చేసుకుంటుంది. ఇది రెండు నెలల వ్యవధిలో తన కార్యాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది.
టవర్- బి నిర్మాణానికి ఉత్తర్వుల జారీ…
మిలీనియం టవర్కు అనుబంధంగా ‘మిలీనియం టవర్-బి’ నిర్మించాలని ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. దీన్ని రూ. 55 కోట్లతో నిర్మించనున్నారు. పార్కింగ్కు ఇప్పటికే స్థలం కేటాయించినందున ఎనిమిది అంతస్తుల (జి+7) భవనం నిర్మిస్తే సరిపోతోంది. ఇది పూర్తయితే మరో లక్ష చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వస్తుంది.
అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించాం….
ఐ.టి. సంస్థలకు అనుగుణంగా అధునాతనంగా పది అంతస్తులతో అత్యుత్తమ ప్రమాణాలతో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నాం. తుది మెరుగులు దిద్దుతున్నాం.