తితిదే తరహాలో అప్పన్న క్షేత్రం అభివృద్ధి
తితిదే తరహాలో అప్పన్న క్షేత్రం అభివృద్ధి
జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్
సింహాచలం, న్యూస్టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో సింహాచలం దేవస్థానాన్ని ఆదాయం వచ్చే దిశగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించినట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామిని దర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ‘దేవస్థానంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కల్యాణ మండపాలు, డార్మిటరీలు వంటివి నిర్మిస్తే భక్తుల సంఖ్య పెరిగి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇందుకోసం ప్రణాళికలు తయారు చేసి, తితిదే, రాష్ట్ర దేవాదాయ శాఖల సహకారంతో అభివృద్ధి చేయాలి. నగరాభివృద్ధిలో భాగంగా సింహాచలం క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలి.’ అని కూడా ముఖ్యమంత్రి సూచించారన్నారు. రాష్ట్రంలో ఏ దేవాలయానికి లేని విధంగా అప్పన్న స్వామికి వేలాది ఎకరాల భూములన్నందున కోర్టు ఆదేశాల మేరకు వాటిని విక్రయించి వచ్చే డబ్బుతో అభివృద్ధి చేసుకునేందుకు అవకాశముందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు కలెక్టర్ కుటుంబ సభ్యులతో కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని అంతరాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆస్థాన మండపంలో పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399