కరుణించమ్మా..కనక మహాలక్ష్మీ
కరుణించమ్మా..కనక మహాలక్ష్మీ
జాతరలో రెండో రోజు భక్తుల తాకిడి
అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు
చీపురుపల్లి, న్యూస్టుడే: పతిత పావనీ.. కోర్కెలు తీర్చే కల్పవల్లీ… మాపై కరుణ చూపు తల్లీ అంటూ కనకమహాలక్ష్మి అమ్మవారికి భక్తులు చేతులెత్తి మొక్కారు. సోమవారం రెండో రోజు చీపురుపల్లిలో అమ్మవారి జాతరకు వివిధ ప్రాంతాలను తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచే దేవస్థానంలో వరుస కట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆరవిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ కనమహాలక్ష్మి తల్వికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అంతకుముందు అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా పూజలు కొనసాగాయి. రెండో రోజు వీఐపీ, దాతల కన్నా మిగతా క్యూలైన్లు చాంతాడులా కనిపించారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, మండపం కిటికిటలాడాయి. జాతరలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయశాఖ ఉద్యోగులు విధులు నిర్వహించారు. భక్తులకు దాహర్తిని తీర్చడానికి ఆలయ ప్రాంగణంలో తాగునీటి సరఫరా చేశారు. దేవస్థానం పరిసరాల్లో ఎప్పటికప్పుడు పరిశుభ్రత పనులను పంచాయతీ సిబ్బంది చేపట్టారు.
ఆకట్టుకున్న జిల్లాస్థాయి నృత్య పోటీలు: చీపురుపల్లి పట్టణంలో కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన జిల్లాస్థాయి బృంద నృత్య పోటీలు ఊర్రూతలూగించాయి. ప్రధాన వేదిక వద్ద రాత్రి పది గంటల నుంచి సోమవారం తెల్లవారజాము 3 గంటల వరకు నృత్యప్రదర్శనలు కొనసాగాయి. జిల్లాస్థాయి పోటీలైనప్పటికీ విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కళకారులు పాల్గొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399