ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు రూ.44.34 కోట్లు మంజూరు
ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు రూ.44.34 కోట్లు మంజూరు
ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగంలో 30 మంది పరిశోధకులకు అవకాశం ఏయూ ప్రాంగణం, న్యూస్టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలకు కేంద్ర కమ్యూనికేషన్, ఐటీ మంత్రిత్వ శాఖ రూ.44.34 కోట్ల నిధులను మంజూరు చేసింది. నిధులను ఏయూకు అందజేస్తూ ఉత్తర్వులను వెలువరించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఏయూ ఇన్ఛార్జి వీసీ ఆచార్య ఇ.ఎ.నారాయణకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సి.హెచ్.వి.రామచంద్రమూర్తి, వైస్ ప్రిన్సిపల్ ఆచార్య పి.ఎస్.అవధాని తదితరులు మంగళవారం అందజేశారు. విశ్వేశ్వరయ్య పీహెచ్డీ పథకంలో భాగంగా ఈ నిధులు మంజూరయ్యాయి. వీటితో ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్, సిస్టమ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ తదితర విభాగాల్లో రానున్న అయిదేళ్ల కాలంలో విశిష్ఠ పరిశోధనలు జరిపేందుకు విద్యార్థులకు అవకాశం కలిగింది. పది మంది పూర్తిస్థాయి పరిశోధకులు, 20 మంది పార్ట్ టైమ్ పరిశోధకులకు ఈ విభాగం ద్వారా పరిశోధనలు చేయవచ్చు. పరిశోధనలతోపాటు పరిశోధకుల ఉపకార వేతనాలకు ఈ నిధులు వెచ్చిస్తారు. నిధులు మంజూరు కావడం పట్ల ఏయూ వీసీ ఆచార్య నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రారు ఆచార్య ఉమామహేశ్వరరావు, ఇతర ఆచార్యులు పాల్గొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399