ఆకర్షణీయ పాఠశాలలకు జాతీయ అవార్డు
ఆకర్షణీయ పాఠశాలలకు జాతీయ అవార్డు
- తక్కువ ఖర్చుతో అధునాతన వసతులపై హర్షం జీవీఎంసీ అన్ని పాఠశాలలకూ రూ.52 కోట్ల గ్రాంటు.
- విశాఖ నగరంలోని పేద పిల్లల పాఠశాలల్ని తక్కువ ఖర్చుతో అధునాతన వసతులతో స్మార్ట్ క్యాంపస్లుగా మార్చిన
ప్రక్రియ ప్రశంసలందుకుంది.
- కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నుంచి సిటీ టు ఇన్వెస్టిమెంట్ ఇంటిగ్రేట్ అండ్ సస్టెయిన్ (సీఐటీఐఐఎస్)
ఛాలెంజ్ కింద జాతీయ అవార్డు దక్కింది.
- జీవీఎంసీ కమిషనర్ ఎం.హరినారాయణన్ మంగళవారం దిల్లీలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ చేతులమీదుగా ఈ
అవార్డును అందుకున్నారు.
- స్మార్ట్సిటీలో భాగంగా రూ.3 కోట్లతో నగరంలోని 4 పాఠశాలల్ని అన్ని హంగులతో సాంకేతిక పరిజ్ఞానంతో
ఆధునికీకరించారు.
- పాఠశాలల్లో అందుబాటులో ఉన్న తక్కువ స్థలంలోనే ఆటలకు అనువుగా అత్యాధునిక వసతులు, డిజిటల్
క్లాస్రూములు, తరగతి గదుల్ని తీర్చిదిద్దారు.
- పాఠశాల ఆవరణం, గోడలు.. ఇలా అన్నీ పిల్లలకు ఆహ్లాదకరంగా ఉండేలా,పచ్చికతో కనిపించడం లాంటివి చేశారు
- దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈవిధంగా లేకపోవడం,పేద పిల్లల పాఠశాలల్లో అన్ని వసతులూ ఒకేచోట ఉండేలా చేయడం అవార్డు వచ్చేందుకు ప్రధాన కారణంగా నిలిచింది.
- ప్రశంసాపత్రంతో పాటు జీవీఎంసీకి రూ.52కోట్ల గ్రాంటును కూడా విడుదల చేసింది.
- దీంతో నగరంలోని 146 పాఠశాలల్లో ఇదే తరహా అధునాతన వసతులు పెంపొందించేలా మెరుగులు దిద్దుతామని కమిషనర్ ఎం.హరినారాయణన్ ‘ఈనాడు’కు తెలిపారు.