Posted on October 03, 2016 by vijay kumar in Realestate News
అరకులోయలో క్రీడా పాఠశాల ప్రారంభం తాత్కాలికంగా గురుకుల పాఠశాల ప్రాంగణంలో తరగతులు
అరకులోయ, అరకులోయ పట్టణం, న్యూస్టుడే : అరకులోయలో క్రీడా పాఠశాలను ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు అరకులోయలో క్రీడా పాఠశాల ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. తాత్కాలికంగా అరకులోయలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రాంగణంలోని భవనంలో గురుకులం డిప్యుటీ కార్యదర్శి లక్ష్మణరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులను ఎంపిక చేసి వారికి శిక్షణనందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అరకులోయలోని యువ శిక్షణ కేంద్రాన్ని తరగతుల నిర్వహణకు కేటాయించాలని ఐటీడీఏ అధికారులను కోరామన్నారు. గురుకులం ఆధ్వర్యంలో తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుత దసరా సెలవుల్లో గిరి యువతకు విలువిద్యలో శిక్షణనందించేందుకు 60 మందిని ఎంపిక చేశామన్నారు. వీరికి అరకులోయలోనే శిక్షణ ఉంటుందన్నారు. క్రీడా పాఠశాలకు సంబంధించి దసరా సెలవుల అనంతరం తరగతులు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం 12 మంది సిబ్బందిని నియమించామన్నారు. సీతంపేట, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఐటీడీఏల్లోనూ పలు క్రీడల్లో శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. పాడేరులో ట్రెక్కింగ్లో శిక్షణనందించేందుకు 20 మందిని ఎంపిక చేశామన్నారు. ఈనెల 20 నుంచి విశాఖపట్నంలో 13 జిల్లాల పరిధిలోని గురుకులాల విద్యార్థులకు చదరంగంలో పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో క్రీడా పాఠశాల ప్రిన్సిపల్ మూర్తి, గురుకులాల ప్రిన్సిపాళ్లు పారయ్య, జాకబ్, సుబ్రహ్మణ్యం, అరుణ తదితరులు పాల్గొన్నారు. Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399