అభివృద్ధికి ‘భూ’మంత్రం

పారిశ్రామిక కారిడార్ ఏర్పాటులో చురుగ్గా వ్యవహరిస్తున్న ప్రభుత్వం
ఆందోళనల నుంచి పరిహారం దిశగా రైతుల అడుగులు
ఏడీబీ రుణంతో ప్రాజెక్టుల ఏర్పాటుకు మార్గం సుగమం
గ్రామాలను ఆనుకుని అదనంగా మరో 2000 ఎకరాలను తీసుకోడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జరగాలంటే పారిశ్రామీకికరణ తప్పదని గుర్తించింది. కేంద్రం సైతం అవసరమైన సాయం అందించడానికి ముందుకు వచ్చింది. దీన్లో భాగంగా విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఇందులో వివిధ రకాల రసాయన, పెట్రో ఉత్పత్తుల, లోహ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకుగాను భూముల అవసరం తప్పనిసరి. ఫలితంగా గతంలో గుర్తించిన భూములను తీసుకోవడం తథ్యమని భావించింది. ఆమేరకు ఏడాది కాలంపైబడి భూసేకరణకు చర్యలు చేపట్టింది. రైతులను బుజ్జగిస్తూనే పావులు కదిపింది. ఈ సందర్భంలో పలుమార్లు రైతులు, నాయకులతో అధికారులు, ఎమ్మెల్యే వంగలపూడి అనిత సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భూములకు తగిన పరిహారం అందించడంతోపాటు, ఉపాధి, ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించారు. అయితే దీనిపై భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అంగీకారం తెలపకపోయినా, అధికారులు తమదైన శైలిలో పావులు కదిపారు. దీంతో పలు సమావేశాల అనంతరం ఎకరా జిరాయితీ భూమికి రూ. 18లక్షలు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అంతేకాకుండా ఇందులో చెట్లు, భవనాలు ఇతరాత్ర ఏమున్నా, వాటికీ పరిహారం ఇస్తామని ప్రకటించింది. ఇక డీఫాం భూములున్నవారికి, పట్టాల్లేకపోయినా ప్రభుత్వ భూములను సాగు చేసుకున్నవారికి తగిన పరిహారం ఇస్తామని ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా రైతులు సందిగ్ధంలో పడ్డారు. దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నా, చాలామంది లోపాయికారిగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు రాజయ్యపేట, బోయపాడు ప్రాంతాల్లో ఉన్న జిరాయితీ భూముల రైతులు అంగీకారం తెలపడంతో వారికి అధికారులు చెల్లింపులు ప్రారంభించారు. అయితే ప్రభుత్వ భూములను సర్వే చేస్తూ డీఫాం పట్టాల రైతులు అందుబాటులో ఉండాలని లేకపోతే పరిహారం అందే పరిస్థితి ఉండదని ప్రకటించడంతో వీరంతా ముందుకు వచ్చారు. తొలివిడతలో నక్కపల్లి మండలంలో దాదాపు 2000 ఎకరాల్లో సర్వేచేసి అర్హుల గుర్తింపు చేపడుతున్నారు. ఇది నెలాఖరుకి పూర్తికానుంది. అంతేకాకుండా పరిహారం చెల్లించడానికి నిధులు కొరత లేదని అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పట్లో పరిహారం పొందినప్పటికి భూములు తక్షణమే తీసుకోవడం జరగదని, అంతేకాకుండా పొందిన పరిహారానికి ఏడాదికో, రెండేళ్లకో వడ్డీ లెక్కించుకున్నా భారీగా సొమ్ము చేరడంతోపాటు, సాగుద్వారా తగిన ఆదాయం వస్తుందని ఉన్నతాధికారులు చేసిన ప్రకటన అందర్నీ ఆలోచింపచేస్తోంది. ఆందోళనబాటలో నడిచిన వారు గతంలో ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు ప్రదర్శించకపోవడం భూములివ్వడానికి సిద్ధమవుతున్నారన్న సంకేతాన్నిస్తుంది.
అభివృద్ధి కావాలని కోరుకుంటున్నవారు ఎక్కువగానే ఉన్నా భూములను కోల్పోయేవారికి సరైనా న్యాయం జరిగేలా చూడటంతోపాటు వ్యవసాయాధారంగా బతికే ఇతర చేతి, కులవృత్తుల వారి పరిస్థితి కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్న వారు పరిశ్రమల ఏర్పాటు తర్వాత తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సందేహాలను పూర్తిగా నివృత్తిచేయాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. ఈవిషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆమేరకు యువతకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతేకాకుండా జిల్లాలో ఇప్పటికే వివిధ రకాల విద్యాసంస్థల ఏర్పాటు జరుగుతున్నా, పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విద్యాసంస్థలను నెలకొల్పగలిగితే ప్రభుత్వంపై మరింత నమ్మకం ఏర్పడుతుంది. పరిశ్రమల ఏర్పాటు జరిగితే మాత్రం కచ్చితంగా ఈ ప్రాంతానికి పారిశ్రామిక, అభివృద్ధి పటంలో తగిన చోటు లభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ పరిశ్రమలు, అదే విధంగా పర్యటక ప్రాంతాలు, ఆరు వరుసల రహదారి తదితర ఏర్పాటు సమాంతరం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం.
Source : http://www.eenadu.net/